తాంసి మండలంలోని పొన్నారి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గ్రామానికి చెందిన ఆనంద్ అనే రైతు పుచ్చకాయలను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం లాగే తన వ్యవసాయ పొలంలో పండిన పుచ్చకాయలను విద్యార్థులకు అందజేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులున్నారు.