సంతానం లేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య

57చూసినవారు
సంతానం లేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య
సంతానం కలగడం లేదనే మనస్తాపంతో కసర్ల రవి (28) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన భైంసా మండలం కామోల్ గ్రామంలో జరిగింది. ఎస్ఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం రవికి రత్నమాలతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. సంతానం లేకపోవడంతో ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.