గుట్కా ప్యాకెట్ తగాదాలో యువకుడు ప్రాణం కోల్పోయాడు. ఈ ఘటన కుబీర్ మండలం పాల్సిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై షరీఫ్ వివరాల ప్రకారం యోగేష్, రమేష్ అనే యువకుల మధ్య గుట్కా ప్యాకెట్ విషయంలో చిన్నపాటి తగాదా చోటుచేసుకుంది. ఈ తోపులాటలో రమేష్ యోగేష్ (20)ను నెట్టేయడంతో సీసీ రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. యోగేష్ కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.