ప్రాణం తీసిన అప్పుల బాధ

18946చూసినవారు
ప్రాణం తీసిన అప్పుల బాధ
అప్పుల బాధతో వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన తానూర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ లోకం సందీప్ వివరాలు ప్రకారం మండలంలోని దౌల్తాబాద్ గ్రామానికి చెందిన రాజులోల వెంకన్న (50) చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపం చెంది గ్రామ శివారులో వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుని భార్య రాజవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్