బీఆర్ఎస్ పాలనలోనే ప్రజలకు సంక్షేమ పథకాలు
నేరడిగొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు మంగళవారం రాత్రి సమావేశమయ్యారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆత్రం సక్కు మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయన్నారు. ఎంపీ గెలుపే లక్ష్యంగా చేయాలని నాయకులకు సూచించారు.