అలర్ట్.. నేడు, రేపు పెరగనున్న ఎండలు

50చూసినవారు
అలర్ట్.. నేడు, రేపు పెరగనున్న ఎండలు
తెలంగాణలో ఎండల తీవ్రత మరింత పెరగనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ, రేపు ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరగనున్నట్లు పేర్కొంది. అలాగే రాష్ట్రానికి వడగాల్పుల ముప్పు పొంచి ఉందని వెల్లడించింది. బుధవారం కొన్ని జిల్లాల్లో ఈ వడగాల్పుల తీవ్రత అధికంగా నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది. కాగా సోమవారం అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెళ్లపాడులో 44.2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.

సంబంధిత పోస్ట్