బ్యాంకు ఖాతాదారులకు ఎస్బీఐ హెచ్చరికలు జారీ చేసింది. మోసపూరిత సందేశాలకు ప్రత్యుత్తరం ఇవ్వవద్దని సలహా ఇచ్చింది. దీంతో చాలా మంది వినియోగదారులు తమ డబ్బును కోల్పోయారు. టెక్స్ట్ మెసేజ్లో ఖాతా వివరాలను ఎప్పుడూ అడగదని బ్యాంక్ తెలిపింది. అవి మోసపూరిత సందేశాలు మాత్రమేనని, అలాంటి సందేశాలు వచ్చిన వెంటనే అప్రమత్తంగా ఉండాలని సూచించింది.