తెలంగాణలో ప్రధాన, రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈనెల 29లోపు దరఖాస్తులు పంపించాలి. అయితే గత ప్రభుత్వ హయాంలోనూ సమాచార కమిషనర్ల నియామకానికి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. గతంలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని సీఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు.