భారత్లో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 2023-24లో ఆల్ టైమ్ రికార్డు నమోదు చేశాయని సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపెడా) ఛైర్మన్ డి.వి.స్వామి వెల్లడించారు. 2022-23లో రూ.63,969.14 కోట్ల విలువైన 17,35,286 టన్నుల సముద్రపు ఉత్పత్తుల ఆహారం ఎగుమతి కాగా.. 2023-24లో రూ.60,523.89 కోట్ల విలువైన 17,81,602 టన్నుల సముద్ర ఉత్పత్తులు దేశం నుంచి ఎగుమతి అయ్యాయని తెలిపారు.