సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ను విచారించే ప్రక్రియ మొదలైంది. చిక్కడపల్లి పీఎస్కు హాజరైన ఆయనను డీసీపీ, ఏసీపీ, సీఐ ప్రశ్నిస్తున్నారు. తొక్కిసలాటలో మహిళ చనిపోయిందని తాము ఆయనకు చెప్పామని పోలీసులు వెల్లడించగా, తనకు చెప్పలేదని అర్జున్ ఇటీవలి ప్రెస్ మీట్లో చెప్పారు. ఈ విషయంపైనే ప్రధానంగా బన్నీని ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం విచారణను పోలీసులు రికార్డ్ చేయనున్నారు.