రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం జులై 12న జరుగనుంది. ఈ నేపథ్యంలో అంబానీ బుధవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను ఆయన నివాసంలో కలిశారు. వివాహానికి హాజరుకావాలని సీఎంను ఆహ్వానించారు.కాగా, ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ల వివాహం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది.