తన టికెట్ను రీషెడ్యూల్ చేయలేదన్న కోపంతో ఓ వ్యక్తి బాంబు బెదిరింపులకు పాల్పడిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియా కస్టమర్ కేర్కు ఓ వ్యక్తి కాల్ చేసి కొచ్చి-లండన్ ఎయిర్ ఇండియా విమానంలో బాంబు పెట్టినట్లు బెదిరించాడు. సమాచారం అందుకున్న కొచ్చి విమానాశ్రయ అధికారులు తనిఖీలు చేపట్టారు. తీవ్ర గాలింపుల అనంతరం అది తప్పుడు సమాచారం అని నిర్ధారించడంతో విమానం లండన్కు బయలుదేరింది.