బిహార్ రాష్ట్రంలో వరుసగా వంతెనలు కూలిపోవడం కలకలం రేపుతోంది. తాజాగా బిహార్లోని గయలో గుల్స్కారీ నదిపై నిర్మించిన మరో వంతెన ఇవాళ కూలిపోయింది. భగవతి గ్రామాన్ని, శర్మ గ్రామాన్ని కలుపుతూ పాఠశాల విద్యార్థులకు కీలక మార్గంగా ఈ బ్రిడ్జి ఉపయోగపడింది. మొత్తంగా బిహార్లో గత కొన్ని వారాలుగా దాదాపు 17 వరకు వంతెనలు, నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిలు కూలిపోయాయి.