బీహార్లో వరుసగా వంతెనలు కూలిపోతున్నాయి. తాజాగా మధుబని జిల్లా బేజా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి కూలిపోయింది. గత వారం వ్యవధిలో బీహార్లో కూలిన ఐదో వంతెన ఇది. రాష్ట్రంలోని ఉత్తర భాగంలో, నేపాల్ సరిహద్దుల వెంబడి ఈ ప్రాంతం ఉంటుంది. వరుసగా బ్రిడ్జిలు కూలిపోవడం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. బ్రిడ్జిల బదులు తమ రాష్ట్రంలో ఎయిర్పోర్టుల సంఖ్య పెంచాలని అక్కడి ప్రజలు సెటైర్లు వేస్తున్నారు.