ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయానికి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు ఆంజనేయస్వామిని దర్శించుకోనున్నారు. ఈ క్రమంలో జగిత్యాల ఎస్పీ అశోక్కుమార్ శుక్రవారం బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ పరిసరాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.