ఉత్తరప్రదేశ్లోని భదోహి జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. విక్రమ్పూర్ ప్రాంతానికి చెందిన ఆంచల్ అనే 23 ఏళ్ల మహిళను కాన్పు కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కుటుంబీకులు అడ్మిట్ చేశారు. డాక్టర్లు వినయ్ కుమార్ పాండే, శివ్ బహదూర్ యాదవ్ ఆపరేషన్ కోసం రూ.50,000 కట్టించుకున్నారు. ప్రసవం కోసం అంచల్కు ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. అస్వస్థతకు గురైన ఆమెతోపాటు కడుపులోని పిండం కూడా మరణించింది. ఈ నేపథ్యంలో నకిలీ డాక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.