తెలంగాణలో మరో భారీ పెట్టుబడి

69చూసినవారు
తెలంగాణలో మరో భారీ పెట్టుబడి
రక్షణరంగ పరికరాల ఉత్పత్తి సంస్థ ‘వెమ్ టెక్నాలజీస్’ తెలంగాణ‌లో మొదటి దశ ప్రాజెక్టులో వెయ్యి కోట్ల పెట్టుబడులు పెడుతోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. జహీరాబాద్ నిమ్జ్‌లో 511 ఎకరాల్లో ఏర్పాటవుతున్న ఈ సమీకృత ఉత్పాదన కేంద్రం వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ట్రయల్ ప్రొడక్షన్‌కు సిద్ధమవుతుందని తెలిపారు. మొదటి దశ పూర్తయితే వెయ్యి మందికి ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు. గురువారం సచివాలయంలో ‘వెమ్ ఇండస్ట్రీస్’ ప్రతినిధులు మంత్రితో సమావేశమయ్యారు.

సంబంధిత పోస్ట్