ఏఐ సిటీగా అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు

66చూసినవారు
ఏఐ సిటీగా అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు
అమరావతి: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) సిటీగా ఏపీ రాజధాని అమరావతిని తీర్చిదిద్దనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. ఏఐ, అమరావతిని కలిపి ఆంగ్లంలో లోగో రూపొందించాలని సూచించారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి, నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని చెప్పారు. 90 రోజుల్లో సీఆర్డీయే కార్యాలయ నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించారు. రాజధానిలో త్వరితగతిన జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు చేపట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్