భారత సిమెంట్ తయారీ పరిశ్రమలో మరో కీలక ఒప్పందం ఖరారైంది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఇండియా సిమెంట్స్ లిమిటెడ్లో 23 శాతం వాటాలు కొనుగోలు చేయనున్నట్లు అల్ట్రాటెక్ సిమెంట్ గురువారం ప్రకటించింది. ఈ కొనుగోలు ఒప్పందం విలువ రూ.1,885 కోట్లని వెల్లడించింది. దాదాపు 7.06 కోట్ల ఈక్విటీ వాటాలను కొనుగోలు చేసేందుకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది.