నీట్ పరీక్ష నిర్వహణలో లోటుపాట్లు, ప్రశ్నాపత్రాల లీకేజ్, నెట్-యూజీసీ 2024 పరీక్ష వివాదంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గురువారం ఢిల్లీలో నిరసనలు చేపట్టారు. వివిధ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజ్లు కొనసాగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. నీట్-యాజీ ఎగ్జామ్ చుట్టూ ముసురుకున్న వివాదాలకు నిరసరగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.