బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి తాజాగా మరో సీసీ ఫుటేజ్ బయటకొచ్చింది. బాంబు ఉన్న బ్యాగుతో నిందితుడు కేఫ్ లోకి వెళ్తున్నట్లు అందులో కనిపిస్తోంది. తర్వాత బ్యాగ్ ను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. అది పేలడంతో 10 మంది దాకా గాయపడిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడి
రూట్మ్యాప్పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.