అర్ష్‌దీప్‌ అరుదైన ఘనత

59చూసినవారు
అర్ష్‌దీప్‌ అరుదైన ఘనత
భారత యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ క్రికెట్ చరిత్రలోనే ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20 ప్రపంచ కప్‌లో 10 పరుగులు కంటే తక్కువ ఇచ్చి నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. నిన్న యూఎస్‌ఏపై ఈ గణాంకాలను(4-0-9-4) నమోదు చేశాడు. దీంతో పాటు మరో రికార్డునూ తన ఖాతాలో వేసుకున్నాడు. పొట్టి కప్‌లో తొలి బంతికే వికెట్‌ తీసిన మొదటి భారత బౌలర్‌గానూ ఘనత సాధించాడు.