ముంబైలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. మలాడ్ ప్రాంతంలో ఒక మహిళ ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఐస్క్రీం కోన్లో మనిషి వేలి ముక్కను కనుగొన్నారు. ఘటన జరిగిన తర్వాత మహిళ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు యమ్మో ఐస్క్రీం కంపెనీపై కేసు నమోదు చేసి ఐస్క్రీమ్ను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు. ఐస్క్రీమ్లో లభించిన మానవ అవయవాన్ని పోలీసులు ఫోరెన్సిక్ కు పంపినట్లు మలాడ్ పోలీసు అధికారులు తెలిపారు.