హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల దాడిలో మరో చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ మక్తా మహబూబ్ పేట్లో ఉంటున్న కుటుంబానికి చెందిన సాత్విక్ (6) ఆడుకుంటూ నిన్న రాత్రి ఇంటి నుండి బయటకు వెళ్లి కనబడకుండా పోయాడు. బాలుడి కుటుంబ సభ్యులు రాత్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించిన ఆచూకీ లభించలేదు. బుధవారం ఉదయం నిర్మానుష్య ప్రాంతంలో బాలుడి మృతదేహం లభ్యం అయింది. బాలుడి ఒంటిపై కుక్కలు దాడి చేసిన గాట్లను పోలీసులు గుర్తించారు.