దారుణం.. సీఐ తల్లిని కిడ్నాప్ చేసి చంపేశాడు!

70చూసినవారు
దారుణం.. సీఐ తల్లిని కిడ్నాప్ చేసి చంపేశాడు!
ఏపీలోని అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. ధర్మవరం వన్ టౌన్ సీఐ తల్లి స్వర్ణ కుమారిని కిడ్నాప్ చేసి హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గత నెల 29న ఎదురింట్లో ఉండే వెంకటేశ్‌తో స్వర్ణకుమారి బైక్‌పై పుంగనూరుకు బయల్దేరారు. అదే అదునుగా భావించిన వెంకటేశ్.. స్వర్ణకుమారిని కిడ్నాప్ చేసి హత్య చేశాడు. మదనపల్లి 2 టౌన్ పరిధిలో ఆమె మృతదేహాన్ని పాతిపెట్టాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసును ఛేదించారు. వెంకటేశ్‌ను కర్ణాటకలో అరెస్ట్ చేశారు. అప్పు విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్