ఖైదీలకు అయోధ్య ప్రత్యక్ష ప్రసారం.. వారు కూడా దేశ పౌరులే

560చూసినవారు
ఖైదీలకు అయోధ్య ప్రత్యక్ష ప్రసారం.. వారు కూడా దేశ పౌరులే
అయోధ్యలో ఈ నెల 22న నిర్వహిస్తున్న రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఖైదీలకు కూడా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని యూపీ జైళ్ల మంత్రి ధర్మవీర్ ప్రజాపతి తెలిపారు. రాష్ట్రంలో లక్షా ఐదు వేల మంది ఖైదీలు ఉన్నారని చెప్పారు. వారు కూడా ఈ దేశ పౌరులేనని, అందువల్ల వారిని ఈ వేడుకకు దూరంగా ఉంచకుండా అన్ని జైళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించామని తెలిపారు.

ట్యాగ్స్ :