ఆజాద్ ఇంజినీరింగ్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. దీని ప్రకారం, రూ.92.7 కోట్ల ఆదాయంపై రూ.14.9 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఈపీఎస్ రూ.2.85గా నమోదైంది. 2022-23 ఇదే కాలంలో ఆదాయం రూ.84.9 కోట్లు, నికర లాభం రూ.14.8 కోట్లుగా ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను ఆదాయం రూ.340.7 కోట్లు, నికర లాభం రూ.58.5 కోట్లుగా నమోదయ్యాయి. 2022-23లో ఆదాయం రూ.251.6 కోట్లు, నికర లాభం రూ.8.47 కోట్లుగా ఉన్నాయి.