మోడీ బ్యాంక్ బ్యాలెన్స్ రివీల్ చేసిన బండి సంజయ్

83చూసినవారు
మోడీ బ్యాంక్ బ్యాలెన్స్ రివీల్ చేసిన బండి సంజయ్
ప్రధాని మోడీపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం వేములవాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. 'ప్రతిష్టాత్మక వేములవాడకు ఇంతవరకు ఏ ప్రధాని రాలేదు. రాజన్నను దర్శించుకున్న ఒకే ఒక్క ప్రధాని మోడీ. అందరిలా మోడీకి కుట్రలు, కుతంత్రాలు తెలియవు. మోడీ బ్యాంక్ బ్యాలెన్స్ కేవలం రూ.5లక్షలు మాత్రమే. ప్రధాని పదవి వద్దనుకుంటే జబ్బకు సంచి వేసుకుని వెళ్లిపోయే రుషి' అని అన్నారు.