ఒడిశా క్రికెటర్ సుమిత్ శర్మపై బీసీసీఐ రెండేళ్ల పాటు నిషేధం విధించింది. ఇకపై అతడు ఏ దేశవాళీ టోర్నీల్లో పాల్గొనకుండా క్రమశిక్షణా సంఘం చర్యలు తీసుకుంది. ఫేక్ బర్త్ సర్టిఫికేట్లు సమర్పించినందుకుగాను అతడిని వేటు వేసింది బీసీసీఐ. సుమిత్ 2015-16 సీజన్లో ఓ బర్త్ సర్టిఫికెట్ బీసీసీఐకి సమర్పించాడు. అయితే, ప్రస్తుతం ఇచ్చిన సర్టిఫికేట్కు అది భిన్నంగా ఉండటంతో అతడిని బ్యాన్ చేసింది.