ఇప్పటికే రెండు లిస్టులను విడుదల చసిన
వైసీపీ మూడో జాబితా విడుదలకు కసరత్తు చేస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో మూడో లిస్ట్ కూడా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో సీఎంవో కార్యాలయానికి నేతలు క్యూకడుతున్నారు. శుక్రవారం మంత్రి గుమ్మనూరు జయరాం, నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కార్యాలయానికి వచ్చారు. లిస్ట్లో ఎవరి పేరు ఉంటుందోనని ఉత్కంఠ అందరిలో నెలకొంది.