ఈ 5 రోజులు జాగ్రత్త.. ఎండలు పెరుగుతున్నయ్

170794చూసినవారు
ఈ 5 రోజులు జాగ్రత్త.. ఎండలు పెరుగుతున్నయ్
తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి 5 రోజులపాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణం కంటే రెండు నుంచి ఐదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది. శనివారం తెలంగాణలోనే అత్యధికంగా నల్గొండ జిల్లాలోని బుగ్గబావిగూడలో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. ఇక ఇప్పటికే ఎండలపై అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసినట్లు చెప్పింది.