బెజవాడ కనక దుర్గమ్మకి వజ్రాల కిరీటం (వీడియో)

71చూసినవారు
కనక దుర్గమ్మ కొలువైన విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. అమ్మవారు భక్తులకు బాలాత్రిపురసుందరిగా దర్శనం ఇస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ముంబైకి చెందిన సౌరభ్ అనే వ్యక్తి అమ్మవారికి (2 కోట్లకు పైగా విలువైన) వజ్రాల కిరీటం అందజేశారు. అలాగే సీఎం రమేష్ అనే భక్తుడు సూర్యచంద్రులను, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన భక్తురాలు సూర్యకుమారి బొట్టును అందజేశారు. ఆలయ పండితులు వీటిని అలంకరించనున్నారు.

ట్యాగ్స్ :