లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్పై ఈడీ పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి నియాయ్ బిందు అన్నారు. నిన్న కేజ్రీవాల్కు మంజూరైన బెయిల్ ఆర్డర్లో పలు విషయాలు వెల్లడయ్యాయి. కేజ్రీవాల్ లేదా ఆయన ప్రతినిధి విజయ్ నాయర్ నేరుగా అవినీతికి పాల్పడ్డారని ఈడీ ఆధారాలు చూపలేకపోయింది. కాగా, ఆయనకు మంజూరైన బెయిల్ పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే.