పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు రెండు కేసుల్లో ఊరట లభించింది. 2022 నాటి ప్రభుత్వ వ్యతిరేక ‘లాంగ్ మార్చ్’ విధ్వంసం ఘటన కేసుల్లో జిల్లా సెషన్స్ కోర్టు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ షైస్టా కుండి ఇమ్రాన్ ఖాన్ను నిర్దోషిగా ప్రకటించారు. ఇస్లామాబాద్లోని లోహిభైర్, సహలా పోలీస్ స్టేషన్లలో నమోదైన ఈ కేసుల్లో ఆయన మంగళవారం తీర్పు వెల్లడించారు.