బుధవారం జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో తెల్లవారుజామున జరిగిన హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు సేకరించారు. కారు అతివేగంతో బైక్ను ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందినట్లు గుర్తించారు. మృతి చెందిన యువకుడు లింగాల
తారక్ రామ్ అని, నోవాటెల్ హోటల్లో బౌన్సర్గా పనిచేస్తున్నాడని, అతనికి 11 నెలల కుమారుడు ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పరారీలో ఉన్న కారు డ్రైవర్ కోసం అధికారులు వెతుకుతున్నారు.