రాముడి ఫొటో ముద్రించిన ప్లేట్లలో బిర్యానీ వడ్డించి అమ్మడం చర్చనీయాంశం అయింది. ఢిల్లీలోని జహంగీర్ పురిలో ఈ ఘటన వెలుగు చూసింది. హోటల్ యజమాని రాముడి చిత్రపటం ఉన్న ప్లేట్లలో బిర్యానీ అమ్మడాన్ని భజరంగదళ్ సభ్యులు వ్యతిరేకించారు. తమ మనోభావాలు దెబ్బతీస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.