మోదీపై ఖర్గే సంచలన ఆరోపణలు

70చూసినవారు
మోదీపై ఖర్గే సంచలన ఆరోపణలు
భారతీయుల సంపద మొత్తం మోదీ స్నేహితుల వద్ద ఉందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన ఆరోపణలు చేశారు. మోదీ ప్రభుత్వ హయాంలో పేద, ధనిక వర్గాల మధ్య అంతరం చాలా పెరిగిందని, అది బ్రిటీష్ రాజ్యంలో కంటే 100 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుందన్నారు. 70 కోట్ల మంది భారతీయుల సంపద మోదీజీ స్నేహితులైన టాప్ 22 మంది ధనవంతుల వద్దే ఉందన్నారు. మోదీ ప్రభుత్వం ఏర్పాటైన 9 ఏళ్లలో లక్ష మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్