కేంద్రంలో కుప్పకూలనున్న బీజేపీ ప్రభుత్వం: అఖిలేశ్ యాదవ్

55చూసినవారు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలుతుందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ జోస్యం చెప్పారు. కోల్‌కతాలో ఆదివారం జరిగిన టీఎంసీ ధర్మ్‌తలా ర్యాలీలో ఆయన మాట్లాడారు. అడ్డదారులు తొక్కయినా అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. బెంగాల్ ప్రజలు బీజేపీతో పోరాడి ఆ పార్టీని వెనక్కి నెట్టేశారని అన్నారు. ఢిల్లీ గద్దెపై కూర్చున్న పాలకులు మరి కొద్దిరోజులు మాత్రమే అధికారంలో ఉంటారని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్