కేరళ సీఎం పినరయి విజయన్ మతం పేరుతో ప్రజల్ని
రెచ్చగొడు
తున్నారని కేరళ
బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. సీఎం ముస్లిం వర్గాల ప్రజలను రెచ్చగొడుతున్నారని
బీజేపీ ఆరోపించింది. కేంద్రం తీసుకువచ్చిన సీఏఏ నోటిఫికేషన్పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రసంగాన్ని
బీజేపీ ఉదహరించింది. సీఎం ‘‘మతం పేరుతో ప్రచారం’’ చేస్తున్నారని, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుందని, ఆయన ప్రచారాన్ని నిషేధించాలని కోరుతూ ఈసీకి లేఖ రాసింది.