ఆ రోజున అకౌంట్లోకి డబ్బులు జమ

71చూసినవారు
ఆ రోజున అకౌంట్లోకి డబ్బులు జమ
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుతో బకాయిలు పేరుకుపోవడంపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. కొత్త డీఏతోపాటు పెరిగిన జీతాలు, హెచ్‌ఆర్‌ఏ, రెండు నెలల బకాయిలు మార్చి 30న జమ అవుతాయని సమాచారం. ఇదిలా ఉంటే 4 శాతం డీఏ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం డీఏ 50 శాతానికి పెరిగింది. దీని ద్వారా 48.67 లక్షల మంది ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.

సంబంధిత పోస్ట్