ఇద్దరు నేతలపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

67చూసినవారు
ఇద్దరు నేతలపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు
శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్, డీఎంకే మంత్రి అనితా రాధాకృష్ణన్ ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి(ఈసీ)కి బీజేపీ ఫిర్యాదు చేసింది. పీఎంని కించపరిచే విధంగా ఇద్దరు నేతలు వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. బుల్దానాలో జరిగిన ర్యాలీలో సంజయ్ రౌత్ ప్రసంగిస్తూ.. ప్రధాని మోదీని ఔరంగజేబుతో పోల్చారు. తమిళనాడు మంత్రి అనితా రాధాకృష్ణన్ రాష్ట్రంలో జరిగిన ఓ సభలో ప్రధానిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్