ఏపీలోని గోదావరి, కృష్ణా నదుల్లోని లంక గ్రామాలు, హోప్ ఐలాండ్, బాపట్ల జిల్లా నాగాయలంక మండలం ఎలచెట్ల దిబ్బ పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు ఈవీఎంలను బోట్లు, పడవలలో తీసుకువెళ్ళారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని హోప్ ఐలాండ్ పోలింగ్ కేంద్రానికి సముద్రంలో 16 కిలోమీటర్లు బోటులో ప్రయాణించి సిబ్బంది వెళ్లారు. పోలింగ్ తరువాత కూడా బోట్ల ద్వారా ప్రయాణించి ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు చేర్చారు.