స్కూల్‌పై బాంబు దాడి.. 39 మంది మృత్యువాత

57చూసినవారు
స్కూల్‌పై బాంబు దాడి.. 39 మంది మృత్యువాత
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న భీకర దాడుల్లో గురువారం మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గాజాలో పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి సంస్థ నిర్వహిస్తున్న పాఠశాలపై ఇజ్రాయెల్ బలగాలు బాంబు దాడులు జరిపాయి. ఐదుగురు స్కూల్ విద్యార్థులు సహా కనీసం 39 మంది మృత్యువాతపడినట్టుగా తెలుస్తోంది. గురువారం తెల్లవారుజామున సెంట్రల్ గాజాలో ఈ దాడి జరిగినట్టు సమాచారం.