భారత తొలి ప్రధాని నెహ్రు చేసిన కొన్ని తప్పిదాలే ఇవాళ పాకిస్థాన్ అక్రమిత కశ్మీర్, చైనా రూపంలో భారత్ను ఇబ్బందిపెడుతున్నాయని విదేశాంగ మంత్రి జై శంకర్ అన్నారు. ఐక్యరాజ్య సమితిలో భారత్ శాశ్వత సభ్యత్వంపై చర్చలు జరుగుతున్న సమయంలో నెహ్రు భారత్ను కాదని చైనాకు ప్రాధాన్యమిచ్చారని జై శంకర్ నాటి ఘటనలను గుర్తుచేశారు. చైనాకు శాశ్వత సభ్యత్వం ఇచ్చాక భారత్కు ఇవ్వాలని నెహ్రు అన్నారని అన్నారు.