పాఠశాల పుస్తకాల ముద్రణకు సంబంధించి NCERT కీలక అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే 1, 2, 7, 8, 10, 12 తరగతులకు సంబంధించిన 33 లక్షల పుస్తకాలను ప్రింట్ చేసి షాపులకు పంపిణీ చేశామని.. 3 నుంచి 6వ తరగతుల కొత్త పుస్తకాలను మే నెలలోపు ప్రచురిస్తామని వెల్లడించింది. అలాగే 4, 5, 9, 11 తరగతులు పుస్తకాలను ఈ నెలలో మార్కెట్లోకి అందుబాటులో ఉంచేలా చేస్తామని పేర్కొంది.