రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో సంచలనం రేపిన ఇద్దరు యువకుల జంట హత్యలకు వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించడమే కారణమని తెలిసింది. జల్కం రవి ఈ నెల 4న పుట్టిన రోజు వేడుకలు జరుపుకుని వాటిని తమ గ్రామ గ్రూప్లో షేర్ చేశాడు. దీనిపై శేషిగారి శివగౌడ్ (24), గుండెమొని శివ (29) తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆ గ్రూప్ నుంచి జల్కం రవిని రిమూవ్ చేశారు. ఇదే విషయమై మాట్లాడుకుందామని రవి, రాజుగౌడ్ ఆ యువకులను వెంచర్కు పిలిచి కత్తులతో దాడి చేసి నరికి చంపారు.