భద్రాచలం రామాలయంలో ఇవాళ్టి నుంచి బ్రేక్ దర్శనం అమల్లోకి వచ్చింది. ఉ.9 నుంచి 9.30 వరకు, రా.7 నుంచి 7.30 వరకు బ్రేక్ దర్శనానికి అనుమతిస్తారు. ఆ సమయంలో ఉచిత, ప్రత్యేక దర్శనంతో పాటు ఇతర సేవలను నిలిపివేస్తారు. టికెట్ ధర రూ.200గా నిర్ణయించారు. ఆలయ కౌంటర్ల వద్ద, వెబ్సైట్లో టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చు.