అగ్నిపథ్‌పై మాటల తూటాలు

57చూసినవారు
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ల మధ్య మాటల తూటాలు పేలాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన అగ్నిపథ్‌ను ‘యూజ్‌ అండ్‌ త్రో లేబర్‌’ పథకంగా రాహుల్‌ అభివర్ణించారు. అగ్నివీర్‌ ప్రాణాలు కోల్పోతే అతడిని అమర వీరుడిగా పరిగణించరని అన్నారు. దీనిపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇస్తున్నామన్నారు. నిష్ణాతులతో చర్చించి, ఎంతో ఆలోచించాకే ఈ స్కీమ్ తెచ్చామన్నారు.

సంబంధిత పోస్ట్