ప్రధాని మోదీకి కోహ్లీ కృతజ్ఞతలు

84చూసినవారు
ప్రధాని మోదీకి కోహ్లీ కృతజ్ఞతలు
టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ గెలిచిన అనంతరం ప్రధాని మోదీ జట్టు సభ్యులతో మాట్లాడి వారికి అభినందనలు తెలిపారు. దీనిపై తాజాగా విరాట్ కోహ్లీ స్పందించారు. ‘మోదీ సార్.. మీ మాటలకు, మీ మద్దతు, ప్రోత్సాహానికి ధన్యవాదాలు. వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో భాగమైనందుకు గర్వంగా ఉంది. ఈ విజయంతో మేము సంతోషంగా ఉన్నాము. దేశ ప్రజల ఆనందాన్ని చూసి ముగ్దులమయ్యాము’ అని ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్