దక్షిణ కొరియాలో దారుణం చోటు చేసుకుంది. సెంట్రల్ సియోల్లోని ట్రాఫిక్ లైట్ వద్ద వేచి ఉన్న పాదచారులను కారు ఢీకొట్టడంతో తొమ్మిది మంది మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. పాదచారులను ఢీకొనే ముందు ప్యాసింజర్ కారు రాంగ్ సైడ్ వెళ్లి మరో రెండు కార్లను ఢీకొట్టిందని మీడియా నివేదికలు వెల్లడించాయి. కారు డ్రైవర్ (60)ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.